May 16, 2024

Sad man holding head with hand

సయ్యద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ

-సయ్యద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ

యావత్తు విశ్వసార్వభౌమత్వం హస్తగతమైవున్న దేవుడు ఎంతో శుభదాయకుడు. ఆయన ప్రతి వస్తువుపై, ప్రతి విషయంపై సర్వాధికారం కలిగి ఉన్నాడు. మీలో ఎవరు మంచి పనులు చేస్తారో (మరెవరు చెడ్డపనులు చేస్తారో) పరీక్షించడానికి ఆయన జీవన్మరణాలు సృష్టించాడు. ఆయన మహా శక్తిమంతుడు, గొప్ప క్షమాశీలి. (అల్‌ ముల్క్‌ : 1-2)జీవితం ఎల్లప్పుడూ మనమీద మనకే సవాళ్ళను విసురుతూనే ఉంటుంది, వాటిని ఎదుర్కొని నిలిచినప్పుడే విజేతలమవుతాము. పోరాడాలనుకుంటే ముందు మనపై మనం గెలవాలి, మనలోనే ఉన్న మన శత్రువుపై గెలవాలి. మనపై మనం గెలవడం అంటే? మనం ఎదుర్కొనే ప్రతి సవాలు, మనం సాధించలేమని, మనం చేతకానివారమని, మనం బలహీనులమని మనల్ని హేళన చేసినప్పుడు దానికి మనమిచ్చే సమాధానం- మన ధైర్యం, మనలో ఉన్న విశ్వాసమే.విశ్వాసంలో ఒక వినూత్నమైన అనుభవం అనుదినం అయిదు పూటల ప్రార్ధనలలో మన జీవితంపై మనమే పోరాడడం. విశ్వాసి జీవితంలో ప్రార్ధనా పోరాటానికి అల్లాహ్ కృప తోడైతే ఈ అంతరంగ యుద్ధంలో అంతిమ విజయం మనదే. ‘‘మనం విశ్వకర్త అయిన అల్లాహ్ ను విశ్వసించాము. అయితే మనలో… మనకు మాత్రమే తెలిసిన రహస్యమైన కొన్ని లోపాలు, పాపాలు మిగిలి ఉన్నాయి. వాటిని మనం ఎలా జయించగలము’’ అనే ఆలోచనలు ఉన్నప్పుడే ఈ అంతరంగ యుద్ధం మొదలవుతుంది, అల్లాప్‌ా చిత్తమయితే మనకు ఆత్మశుద్ధి లభిస్తుంది. ఏదైనా సాధించాలనే సంకల్పం మనలో బలంగా ఉంటేనే మన చుట్టూ ఉండే ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి, అనుకూలంగా అల్లాహ్ మారుస్తాడు.విశ్వాసులారా! సహనం వహించి, ప్రార్థన చేస్తూ (మా)సహాయం అర్థిస్తూ ఉండండి. దేవుడు సహనం వహించేవారికే తోడుగా ఉంటాడు. (అల్‌ బఖరః – 153)మరో చోట ఇలా అంటున్నాడు:భయం, ఆకలి, ధనప్రాణ, పంటల నష్టాలు కలిగించి మిమ్మల్ని మేము తప్పనిసరిగా పరీక్షిస్తాము. అలాంటి స్థితిలో సహనం వహించి, ఆపద వచ్చినప్పుడు ‘‘మేము దేవునికి చెందినవారం. దేవుని వైపునకే పోవలసినవాళ్ళం’’ అని పలికేవారికి వారి ప్రభువు కారుణ్య కటాక్షాలు లభిస్తాయని శుభవార్త విన్పించు… అలాంటివారే సన్మార్గగాములు. (అల్‌-బఖరప్‌ా: 155-157)అల్లాప్‌ా చేస్తున్న వాగ్దానాన్ని కూడా కాస్త గమనించండి:మీ పూర్వీకులను అల్లాహ్ ఏవిధంగా లోకంలో ఖలీఫా (దైవ ప్రతినిధి)గా చేశాడో అదేవిధంగా మీలో విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని కూడా ఖలీఫాగా చేస్తానని ఆయన వాగ్దానం చేస్తు న్నాడు. అదీగాక వారి కోసం తాను ఆమోదించిన ధర్మాన్ని వారు ఆచరించేందుకు పటిష్ఠమైన పునాదులపై నెలకొల్పుతానని, వారి (ప్రస్తుత) భయానక స్థితిని శాంతియుతంగా మారుస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు. అయితే వారు నన్ను మాత్రమే ఆరాధిం చాలి. నాకు మరెవరినీ సాటి కల్పించకూడదు. ఆ (వాగ్దానం) తర్వాత ఎవరు తిరస్కార వైఖరి అవలంబిస్తారో వారే దుర్జనులు. విశ్వాసులారా! ప్రార్థనా వ్యవస్థను నెలకొల్పండి. పేదల ఆర్థిక హక్కు (జకాత్‌) నెరవేర్చండి. దైవప్రవక్త పట్ల విధేయత కలిగి ఉండండి. అప్పుడే మీరు కటాక్షించబడతారని ఆశించగలరు. (నూర్‌: 55-56)కష్టాలను కరిగించే కరదీపికలు1) దుఆ : దుఃఖాన్ని దూరం చేసే గొప్ప ప్రార్థనలలో ఒకటి ప్రవక్త యూనుస్‌ (అ) వారి ప్రార్థన.‘‘లా ఇలాహ ఇల్లా అంత సుబ్‌హానక ఇన్నీ కుంతు మిన జ్జ్వాలిమీన్‌’’చివరికతను (చేప కడుపులో చిక్కుకొని) గాఢాంధకారంలో ‘‘నీవు తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు. నీవు పరిశుద్ధుడవు. నేనే నిజంగా నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను’’ అని మొర పెట్టుకున్నాడు. మేమతని మొరాలకించి అతడ్ని బాధ, పరితాపాల నుండి విముక్తి కల్గించాం. ఇలాగే మేము విశ్వాసుల్ని రక్షిస్తాం. (అన్‌ బియా: 87-88)2) ధర్మ పాలన : మనం ధర్మ శాస్త్రానికి కట్టుబడి జీవిస్తే అల్లాహ్ మనల్ని రక్షిస్తాడు.3) అల్లాహ్ స్మరణ : కలిమి స్థితిలో మనం అల్లాహ్  స్మరిస్తే, కష్ట సమయంలో అల్లాప్‌ా మనల్ని గుర్తుంచుకుంటాడు.4) మనం మారితే మన స్థితి మారుతుంది : అల్లాహ్ ఆదేశాల కనుగుణంగా మన జీవితాన్ని మనం మార్చుకుంటే మనకే సమస్య వచ్చినా అల్లాహ్ మన ముందుండి మనల్ని ఆదుకుంటాడు.5) దైవ భీతి : అల్లాహ్ , అంతిమదినాన్ని విశ్వసించినవారికి ఈ మాటల ద్వారా ఉపదేశం చేయబడుతోంది: అల్లాహ్ కు భయ పడుతుండేవాడికి అల్లాహ్ కష్టాల నుంచి బయటపడే దారి చూపుతాడు. (ఒకవేళ ఏవైనా ఇబ్బందులుంటే) అతనికి అల్లాహ్ అతని ఊహకు సైతం అందని దిశ నుండి ఉపాధినిస్తాడు. (తలాఖ్‌: 2-3)6) సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యెడల నమ్మకం : అల్లాహ్ను నమ్ముకునేవాడికి అల్లాహే చాలు. అల్లాప్‌ా తన పని తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన ప్రతి దానికీ ఓ లెక్క నిర్ణయించిపెట్టాడు. (తలాఖ్‌: 3)పండితుల మాట బంగారు మూట: నలుగురు నాలుగు విధాలు అనడం ఒక ఆనవాయితీ. అయితే ఆ నలుగురు నాలుగు వేర్వేరు సమస్యలతో సతమతమవుతూ కూడా ఈ విషయాలను వారు ఎలా విస్మరిస్తున్నారో మాకు అంతుబట్టడం లేదు అన్నారు పండితులు. ఎవరా నలుగురు? ఏమిటి వారి సమస్యలు? వారు మరచిన ఆ విషయాలు ఏవి? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..1) అనారోగ్యంతో, అస్వస్థతతో బాధ పడే వ్యక్తి …అయ్యూబ్‌ గాధ కూడా గుర్తుకు తెచ్చుకో. అతను (వ్యాధిగ్రస్త స్థితిలో ఉండి) ‘‘ప్రభూ!) నేను జబ్బుపడ్డాను. నీవు అందరి కంటే గొప్ప దయామయుడవు’’ అని ఎలుగెత్తి మొరపెట్టుకున్నాడు. మేమతని మొరాలకించి అతని బాధ దూరం చేశాం. అతనికి మేము అతని భార్యాపిల్లలనే కాదు, మా ప్రత్యేక అనుగ్రహంతో ఇంకా అనేక భాగ్యాలు కూడా ప్రసాదించాం. సదాచార సంపన్ను లకు ఇదొక (మంచి) గుణపాఠం. (అన్‌ బియా: 83-84)2) భరించరాని దుఃఖంతో శోక సముద్రంలో నిండా మునిగిన వ్యక్తి మాటలను అల్లాప్‌ా ఎలా నిర్లక్ష్యం చేశాడు అని ఆశ్చర్యమేస్తుంది.మత్స్య బాధితుడి సంగతి జ్ఞాపకం తెచ్చుకో. అతను కోపం వచ్చి వెళ్ళిపోయాడు. మేము తనను నిలదీయబోమని భావించాడు. చివరికతను (చేప కడుపులో చిక్కుకొని) గాఢాంధకారంలో ‘‘నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నీవు పరిశుద్ధుడవు. నేనే నిజంగా ఆత్మ ద్రోహిని’’ అని మొరపెట్టుకున్నాడు. మేమతని మొరాలకించి అతడ్ని బాధ, పరితాపాల నుండి విముక్తి కల్గించాం. ఇలాగే మేము విశ్వాసుల్ని రక్షిస్తాం. (అన్‌ బియా: 87-88)3) సంతాన లేమితో నిరాశా నిస్పృహలకు లోనై మానసిక ఒత్తిడికి లోనైన వ్యక్తి మాటలను అల్లాప్‌ా ఎలా నిర్లక్ష్యం చేస్తాడా?జకరియ్యా వృత్తాంతం కూడా జ్ఞాపకం తెచ్చుకో. అతను తన ప్రభువు సన్నిధిలో ‘‘ప్రభూ! నన్ను (సంతానం లేకుండా) ఒంటరివాడ్ని చేయకు. నీవే అందరికంటే మంచి వారసుడివి’’ అని ప్రార్థించాడు. మేమతని ప్రార్థనను ఆలకించి అతనికి యహ్యాను అనుగ్రహించాం. అతని కోసం అతని భార్యను (గర్భధారణకై) యోగ్యురాలిని చేశాము. వీరంతా అమితోత్సా హంతో సత్కార్యాలు చేస్తుండేవారు. మమ్మల్ని ఎంతో ఆశతో, భయభక్తులతో ప్రార్థించేవారు. మా ముందు ఎంతో అణకువతో ఉండేవారు. (అంబియా: 89-90)4) ఏ వ్యక్తికీ వ్యతిరేకంగానైతే ప్రజలు కుట్రలు పన్నుతున్నారో ఆ వ్యక్తి మాటను అల్లాప్‌ా ఎలా నిర్లక్ష్యం చేస్తాడు? అని ఆశ్చర్య మేస్తుంది.నేను మాత్రం నా వ్యవహారాన్ని దేవునికి అప్పగిస్తున్నాను. ఆయనే తన దాసులకు సంరక్షకుడు. ‘‘చివరికి అల్లాహ్ వారు పన్నిన కుట్రలు, కుయుక్తులన్నిటిని వమ్ముచేసి ఆ విశ్వాసిని కాపాడాడు. ఫిరౌన్‌ అనుయాయులే ఘోర విపత్తులో చిక్కుకొని సర్వనాశన మయ్యారు. (మోమిన్‌: 44-45)5) భయంతో బిక్కుబిక్కుమంటూ బతికే వ్యక్తి ఎలా అల్లాప్‌ా యొక్క ఈ మాటను నిర్లక్ష్యం చేస్తాడు? అని ఆశ్చర్యమేస్తుంది.వారు ద్విగుణీకృత విశ్వాసంతో ‘‘మాకు అల్లాహే చాలు, ఆయన గొప్ప కార్యసాధకుడు’’ అని సమాధానమిచ్చారు. చివరికి వారు అల్లాప్‌ా అనుగ్రహంతో, బహుమానాలతో తిరిగి వచ్చారు. వారికి ఎలాంటి నష్టం జరగలేదు. వారు అల్లాప్‌ా అభీష్టం ప్రకారం నడుచు కున్నారు. దేవుడు (ఇలాంటివారికే) అపారంగా అనుగ్రహించేవాడు. (ఆలి ఇమ్రాన్‌: 172-174)మనం ఎన్ని అనుగ్రహాలలో ఉన్నామో ఒక్కసారి నెమరు వేసుకొండి, అప్పటికీ అర్థం కాకపొతే ఒకే ఒక్కసారి పాలస్తీనా ప్రజల్ని జ్ఞప్తికి తెచ్చుకోండి.ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ బాంబుల దాడికి మృతి చెందిన పాలస్తీనీయన్లు 8000 మంది కాగా, వారిలో 2/3 వంతు మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. రెండు మూడుసార్లు వేదికెక్కి ఆ పీడిత ప్రజల గురించి మాట్లాడితేనే, నాలుగైదు పేజీల వ్యాసం వారి గురించి రాస్తేనే విసుగు చెందే ప్రబుద్ధులు నేడు మన మధ్య చాలా మందే ఉన్నారు. అయితే అక్కడ వారు 75ఏళ్లుగా భీకర వాతావరణంలో జీవిస్తున్నారు.. వారి సొంత గడ్డపై భద్రత లేని బతుకులు వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ మారణకాండ వారిని పూర్తిగా తుదముట్టించేంత వరకు ఆగేలా లేదు. రక్షించేవారు లేక ‘మా ప్రాణాలు గాల్లో తేలుతున్నాయి’ అని అక్కడి తల్లుల రోదిస్తున్నారు.దిక్కులేక పోవడం చూసి అణచి వేయబడ్డ స్త్రీలు, పురుషులు, పిల్లలను రక్షించడానికి మీరు దైవమార్గంలో ఎందుకు పోరాడరు? వారు (బాధలు భరించలేక) ‘‘దేవా! దుర్మార్గులు నివసిస్తున్న ఈ నగరం నుండి మమ్మల్ని బయటికి తీసి కాపాడు. మాకు రక్షణ కల్పించి అండగా నిలిచేవారి నెవరినైనా నీవైపు నుండి మా దగ్గరికి పంపు’’ అని మొరపెట్టుకుంటున్నారే! అలాంటి పీడిత ప్రజల రక్షణ కోసం ఎందుకు పోరాడరు మీరు? (అన్నిసా: 74-75)గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు మంచినీరు దొరక్క…. ఆకలి తీర్చుకోవడానికి పట్టెడన్నం లభించక వారు అల్లాడిపోతున్నారు. బాధితుల ఆర్తనాదాలు అధికమవుతున్న కొద్దీ ఆసుపత్రుల్లో ప్రాథమిక ఔషధాలూ నిండుకొంటున్నాయి. మాటలకు అందని మానవతా సంక్షోభమిది… మృగాలకంటే హీనంగా అకారణంగా అమాయకుల ఉసురుపోసుకుంటున్న బెంజమిన్‌ నెతన్యాహు నరహంతక నైచ్యమిది! వారి కోసం మనకు చేతనయినంత సహాయం చేద్దాం! వారి కోసం చేతులెత్తి ప్రార్థిద్దాం!!జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు… అంటారు పెద్దలు. మానవ జీవితం నిత్యం సంఘర్షణలతో కలిసి ప్రయాణిస్తుంది. సాలెపురుగు గూడు కట్టడంలో ఎంతో నేర్పరితనం ప్రదర్శిస్తుంది. తను అల్లుకునే గూటిలో చిన్న దోషం కూడా రాకూడదు. ఎక్కడ తేడా వచ్చినా ఆ గూడు వదిలేసి, మరో గూడు కట్టుకోవటం మొదలు పెడుతుంది.ప్రతి ప్రాణి జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, అపాయాలు ఎదురవ్వటం సర్వసాధారణం. వాటిని ఎదుర్కోవటానికి నిరంతరం పోరాడుతూనే ఉండాలి. పోరాటానికి ధైర్యం అవసరం. ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉండాలని మన ప్రవక్తల గాథలు, వీర జవానుల కథలు … మరెన్నో మనకు బోధిస్తున్నాయి.విశ్వాసులారా! మీకు పూర్వం విశ్వాసులకు వచ్చిన (కష్టాల)న్నీ మీపై రాకముందే మీకు ఇట్టే స్వర్గప్రవేశం లభిస్తుందని భావిస్తు న్నారా? ఆనాటి విశ్వాసులపై ఎన్నో కష్టాలు, కడగండ్లు విరుచుకు పడ్డాయి. వారు కుదిపివేయబడ్డారు. చివరికి అప్పటి దైవప్రవక్త, ఆయన సహచరులైన విశ్వాసులు (ఆ కష్టాలకు తట్టుకోలేక) ‘‘దైవ సహాయం ఎప్పుడు వస్తుంది?’’ అని అడగసాగారు. అప్పుడు వారికి ‘‘ఇదిగో దైవసహాయం సమీపంలోనే ఉంది’’ (అని ధైర్యం చెప్పడం జరిగింది). (బఖర – 214)మానవ జీవితం కూడా సంఘర్షణలతో నిండి ఉంటుంది. నిరంతరం పోరాడుతూనే ఉండాలి. విజయం సాధించేవరకు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు.ఒక చీమ తన కంటే మూడు రెట్లు బరువుని మోయగలదు. అలా మోసేటప్పుడు ఎన్నోసార్లు అది పడిపోతుంటుంది. కానీ, గమ్యం చేరేవరకు తన ప్రయత్నాన్ని విడిచిపెట్టదు. గాలికి ఎదురీదుతూ, లక్ష్యాన్ని చేరుకుంటుంది.గిజిగాడు గూడు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. లోపల రెండు గదులుగా నిర్మిస్తుంది. గూటి నిర్మాణంలో ఏ చిన్న తేడా వచ్చినా, ఆ గూటిని విడిచిపెట్టి, వేరే గూటిని అల్లుతుంది. లోపం లేకుండా వచ్చేవరకు గూడు కట్టడానికి ఎక్కడా ధైర్యం కోల్పోదు. సృష్టిలోని ప్రతి ప్రాణీ తన లక్ష్యం సాధించుకునే వరకు ధైర్యంగా పోరాడు తూనే ఉంటుంది. కానీ, మానవుల విషయంలోనే అధైర్యం కనిపిస్తుంది. ధైర్యాన్ని కోల్పోయిన మరుక్షణం మనిషి అన్ని విషయాల్లోనూ అపజయం చవిచూస్తాడు. ఎందులో గెలవాలన్నా ధైర్యమే అసలైన ఆయుధం.ఒక్క మాటలో చెప్పాలంటే -(విశ్వాసులారా!) బాధపడకండి. అధైర్యంతో క్రుంగిపోకండి. మీరు నిజమైన విశ్వాసులైతే చివరికి మీరే విజయం సాధిస్తారు. (సత్యా సత్యాల సమరంలో) మీరే కాదు, వారు కూడా దెబ్బతిన్నారు. (ఆ మాత్రానికే ధైర్యం కోల్పోవడమా!) ఇవన్నీ మేము ప్రజల మధ్య తిప్పే కాలపు మిట్టపల్లాలు మాత్రమే. ఆయన మీలో నిజమైన విశ్వాసులెవరో పరీక్షించడానికి, కొందరిని సత్యానికి సాక్షులు (అమరగతులు)గా చేయడానికి ఈ విధంగా చేశాడు. అల్లాప్‌ా దుర్మార్గుల్ని ఎన్నటికీ ప్రేమించడు. ఆయన ఇలాంటి పరీక్ష ద్వారా నిజమైన విశ్వాసులు ఎవరో ఏరివేసి, అవిశ్వాసుల్ని అణచి వేయదలిచాడు. (ఆలి ఇమ్రాన్‌: 139-141)పై పరిస్థితుల్ని ఆసరాగా చేసుకొని కొందరు బురద బుద్ధి ప్రబుద్ధులు తరువాత మీరే అన్నట్టు ఎగాదిగా చూడటం మనం గమనిస్తాము. దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా విశ్వాసులు దుర్మార్గులకు కొమ్ము కాయరు. అదరరు. బెదరరు. కావాలంటే బార చాచి నిలబడ్తారు .చివరి మాటనీళ్లకు బదులు నిప్పులు కురిసినా- ప్రమాద అగ్ని పర్వతాలే పెల్లుబికినా- శోక సముద్రాలే అలలెత్తినా- మనం మాత్రం వెన్ను చూపక ధై నరాలు తెగిపడి నెత్తురు కారినా- నరమేధాలే నేల నాలుగు చెరగులా కరాళ నృత్యం చేసినా- ధర్మం కోసం ప్రాణం పోయినా అబద్దమాడకు, అధైర్యపడకు.